డ్రైనేజీలు పొంగుతున్నయ్​

డ్రైనేజీలు పొంగుతున్నయ్​

హైదరాబాద్, వెలుగు: సిటీలో మెయిన్​రోడ్ల నుంచి గల్లీ రోడ్ల దాకా మ్యాన్ హోల్స్ ​పొంగిపొర్లుతున్నాయి. మురుగంతా రోడ్లపైన పారుతుండగా వాహనదారులు, జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా మురుగు ఆగకుండా పారుతుండడంతో స్థానికులు దుర్వాసన తట్టుకోలేకపోతున్నారు. చౌరస్తాల్లో సిగ్నల్స్​పడిన సమయంలో మురుగులోనే  బైక్​లను నిలపాల్సి వస్తోందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీవరేజీ నిర్వహణ సరిగా లేకనే సమస్యలు వస్తున్నాయి.  ప్రతిసారి ఒకేచోట డ్రైనేజీ లీకేజ్​ అవుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. కొన్ని ప్రాంతాల్లో వారం, 10 రోజులుగా ఇబ్బందులు ఉంటున్నాయి.  వాటర్​బోర్డు అధికారులు మాత్రం సమస్యను పరిష్కరిస్తున్నామని చెబుతున్నప్పటికీ, శాశ్వత చర్యలు తీసుకోవట్లేదు. 

నిర్వహణ లోపంతోనే..
డ్రైనేజీ పైపులైన్ల మరమతులు, నిర్వహణ​పేరుతో ప్రతినెల కోట్లలో వాటర్​బోర్డు ఖర్చు చేస్తుండగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపట్లేదు. వానాకాలంలో వరదనీటితో మ్యాన్ హోల్స్​జామ్​అయి తరచూ పొంగడం సాధారమే. కానీ, సమ్మర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లోనైతే వర్షాకాలాన్ని తలపిస్తున్నాయి. ఎప్పుడో నిర్మించిన డ్రైనేజీ సిస్టమ్​కావడంతోనే సమస్య ఏర్పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జనాభాకు అనుగుణంగా సిటీలో డ్రైనేజీ సిస్టం లేదని ఎక్స్ పర్ట్స్​అంటున్నారు. సిటీలో అవసరమైన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వెంటనే పనులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. 

అల్వాల్​వెంకటాపురం కాలనీలోని ఎస్ బీఐ బ్యాంక్ లేన్ రోడ్డులో15 రోజులుగా మ్యాన్ హోల్ పొంగిపొర్లుతోంది. ఎప్పుడూ ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపండి..అంటూ స్థానికుడు నర్సింగ్​ సోమవారం వాటర్​బోర్డు అధికారులకు ట్విట్టర్​లో కంప్లయింట్​ చేసిండు.”

లంగర్ హౌస్​మెయిన్ రోడ్డుపై 3 రోజులుగా మురుగు పారుతోంది. దీంతో  రాకపోకలకు జనం ఇబ్బంది పడుతుండడమే కాకుండా ఇతర కాలనీల్లోకి వెళ్లేవారికి సమస్యగా మారింది. దీనికి త్వరగా పరిష్కారం చూపాలని అడ్వకేట్ బల్వంత్ రెడ్డి సోమవారం వాటర్​బోర్డు, కేటీఆర్​కు ట్విట్టర్​లో పోస్ట్​ చేసిండు’’.
లంగర్ హౌస్​మెయిన్ రోడ్డుపై 3 రోజులుగా మురుగు పారుతోంది. దీంతో  రాకపోకలకు జనం ఇబ్బంది పడుతుండడమే కాకుండా ఇతర కాలనీల్లోకి వెళ్లేవారికి సమస్యగా మారింది. దీనికి త్వరగా పరిష్కారం చూపాలని అడ్వకేట్ బల్వంత్ రెడ్డి సోమవారం వాటర్​బోర్డు, కేటీఆర్​కు ట్విట్టర్​లో పోస్ట్​ చేసిండు’’.