ట్యాంకర్ బోల్తాపడి డ్రైవర్ మృతి

ట్యాంకర్ బోల్తాపడి డ్రైవర్ మృతి

ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని సరస్వతీ స్కూల్​సమీపంలో నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన శ్రీనివాస్ (34) ట్రాక్టర్ డ్రైవర్‌‌.  కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లపై చల్లేందుకు శనివారం ట్యాంకర్​లో నీటిని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్యాంకర్​ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అతనికి  తీవ్రగాయాలు కావడంతో  శ్రీనివాస్ స్పాట్​లోనే చనిపోయాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ మధుసూదన్ రావు పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.