- సమాచారం లేక తగ్గిన అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కారణంగా జిల్లా కలెక్టరేట్లో 2 నెలలుగా రద్దయిన ప్రజావాణి సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణిని నిర్వహించగా.. కలెక్టర్ అనుదీప్ హాజరుకాలేదు. ఆయన ప్రజాభవన్లో ప్రజాదర్బార్కు వెళ్లారు. దీంతో డీఆర్వో వెంకటాచారి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
మొత్తం 17 ఫిర్యాదులు రాగా.. ఇందులో 11 హౌసింగ్, ఆసరా పెన్షన్తదితర ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు ముందస్తు సమాచారం లేకపోవడంతో ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్డీవో సూర్య ప్రకాశ్, సికింద్రాబాద్ ఆర్డీవో రవికుమార్, ప్లానింగ్అధికారి సురేందర్, బీసీ వెల్ఫేర్ అధికారి ఆశన్న, ఎస్సీ కార్పొరేషన్ అధికారి యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లాలో ప్రజావాణికి 53 అర్జీలు
శామీర్ పేట : అంతాయిపల్లిలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 53 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తొందరగా పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలన్నారు. అనంతరం అర్జీదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.