పరిగి, వెలుగు: నిబంధనలు ఉల్లంఘించి మెడికల్ షాపులు నడిపితే కఠిన చర్యలు తప్పవని డ్రగ్స్ కంట్రోల్ పరిపాలన విభాగం శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ డైరెక్టర్ అంజుమ్ అబిదా హెచ్చరించారు. సోమవారం పరిగిలో డ్రగ్ఇన్స్పెక్టర్ ఎ.ఎన్.క్రాంతి కుమార్ బృందం మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించని ఏడు షాపులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
