- ఐదుగురు అరెస్ట్.. 12.72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
మాదాపూర్, వెలుగు : బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్బస్సుల్లో సిటీకి డ్రగ్స్తెచ్చి విక్రయిస్తున్న పాతనేరస్థుడితోపాటు నలుగురు వ్యాపారులను టీఎన్న్యాబ్అధికారులు, మాదాపూర్పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. 12.72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరుకు చెందిన వెంకటసాయిచరణ్(25) బెంగుళూరులో చదువుకున్నాడు. ప్రస్తుతం అక్కడి జయానగర్లోని టూరిస్ట్ఆఫీసులో జాబ్చేస్తున్నాడు.
వచ్చే జీతం సరిపోకపోవడంతో డ్రగ్స్విక్రయించడం స్టార్ట్చేశాడు. బెంగళూరులో ఎండీఎంఏ డ్రగ్స్ను కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ప్రైవేట్బస్సుల డ్రైవర్లతో పరిచయం పెంచుకుని డ్రగ్స్ సప్లయ్చేస్తున్నాడు. ఈ నెల 21న సాయిచరణ్ఓ ట్రావెల్స్బస్సులో డ్రగ్స్తీసుకువచ్చి, దుర్గం చెరువు వద్ద ఉన్న డాక్టర్స్కాలనీలో కస్టమర్లకు అమ్ముతున్నాడనే సమాచారం అందుకున్న టీఎన్న్యాబ్అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు.
డ్రగ్స్ కొనుగోలు చేసిన మాదాపూర్కు చెందిన లోకేశ్(25), సందీప్రెడ్డి(30), కూకట్పల్లికి చెందిన రాహుల్(30), సనత్నగర్కు చెందిన సుబ్రమణ్యం(25)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12.72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సాయిచరణ్పై గతంలో ఎస్ఆర్నగర్, చందానగర్పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్సప్లై చేసిన కేసులు ఉన్నాయి. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్
నెల్లూరు సిటీలతో పాటు కర్ణాటక రాష్ర్టంలో 50 మంది కస్టమర్లకు రెగ్యూలర్గా డ్రగ్స్ను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మార్నింగ్ స్టార్, రాజేశ్వరి, జీవీఆర్, చెర్రి ట్రావెల్స్బస్సుల్లో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసినట్లు టీఎన్ న్యాబ్ అధికారులు వెల్లడించారు.