- ప్రాణహిత, ఇంద్రావతి పరవళ్లు
- గోదావరిలో పెరిగిన వరద ఉధృతి
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర, చత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో దిగువన గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో ఒక్క గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. గురువారం ఉదయానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్సారెస్పీకి కూడా వరద పెరుగుతున్నది. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి, తుంగభద్ర రిజర్వాయర్లకు కొంతమేర వరద వస్తున్నది. మహాబలేశ్వర్ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో రానున్న రోజుల్లో కృష్ణా ప్రాజెక్టులకు వరద పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వరద మొత్తం దిగువనే ఉండటంతో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు పెద్దగా ఇన్ఫ్లోలు లేవు.