
బాలీవుడ్ సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాపై ప్రత్యేకంగా ప్రశంసలు జల్లు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. భారత పర్యటనలో ఉన్న ఆయన సోమవారం మోతారా స్టేడియంలో ప్రసంగించారు. భారతదేశం తన సృజనాత్మకతని ప్రపంచానికి చాటిచెప్పిన కృషిలో వినోద రంగం ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.
తన ప్రసంగంలో వేదికపై డీడీఎల్జే(DDLJ) గురించి ప్రస్తావిస్తూ.. భారత్లో యేటా అన్ని భాషల్లో 2 వేలకు పైగా సినిమాలు రూపొందిస్తున్నాయని, దేశ ఆర్ధిక ప్రగతిలో తనవంతు సహకారం అందిస్తోదంని అన్నారు.
అంతేకాకుండా క్రికెట్ గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో మేటి ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ భారతీయులే అని ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా వీరికి అభిమానులు ఉన్నారు. గొప్ప గొప్ప క్రికెటర్లను భారత దేశం క్రికెట్కు అందించిందన్నారు.
వినోదరంగమైన సినిమాల గురించి, క్రీడలు, ఆటగాళ్ల గురించి ట్రంప్ ప్రస్తావించడంతో స్టేడియంలోని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చప్పట్లతో హర్షం వ్యక్తం చేసారు.