చారగొండ మండలంలో రేషన్ బియ్యం పట్టివేత

 చారగొండ మండలంలో రేషన్ బియ్యం పట్టివేత

వంగూర్, వెలుగు: చారగొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని సార బండ తండాకు చెందిన వర్షవత్ దస్రు నాయక్ టాటా ఏస్ వాహనంలో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు.

 సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. సరుకును ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ రవి యాదవ్ కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. వర్షవత్​ దస్సుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.