- నేటి నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- 24న సీట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. సోమవారం నుంచే మొదలుకావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను.. ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం కొత్త షెడ్యూల్ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మొదలైన ఆన్లైన్ డిటెయిల్స్ ఫిల్లింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ గడువును 19 వరకు పెంచారు. స్లాట్ బుక్ చేసుకున్నవారికి ఈ నెల12 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు తీసుకుని.. 24న ఫస్ట్ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన స్టూడెంట్లు 28లోగా ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలి. 29 నుంచి నవంబర్ 5 వరకు సెకండ్ ఫేజ్అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ ఫేజ్కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ ఈనెల 29న, 30న వెరిఫికేషన్ఉంటాయి. 30, 31తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. నవంబర్ 2న సీట్లు కేటాయిస్తారు.
సీట్లకు అనుమతి రాక..
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు రాష్ట్ర సర్కా రు అనుమతి ఇవ్వకపోవడంతోనే అడ్మిషన్షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. కాలేజీలకు అనుమతిపై రెండు నెలల కిందే జేఎన్టీయూ ప్రతిపాదనలు పంపి నా.. ఇప్పటికీ స్పందన లేదు. కొత్త కోర్సులకు అనుమతి, సీట్ల పెంపుపై సర్కారు గైడ్ లైన్స్ఇవ్వాల్సి ఉంది.