పశ్చిమ బెంగాల్ లో ప్రచారం ఆపేయండి: EC

పశ్చిమ బెంగాల్ లో ప్రచారం ఆపేయండి: EC

పశ్చిమ బెంగాల్ లో ప్రచారంలో ఘర్షణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక్క రోజు ముందుగానే ఎన్నికల ప్రచారం ముగించాలని ఆదేశించింది. ఏడో విడతలో పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న 9 లోక్ సభ స్థానాలకు  మే 16న  రాత్రి 10 గంటలకే  ఎన్నికల ప్రచారం ముగియనుంది. మే 19 న  లోక్ సభ ఏడో విడత పోలింగ్ జరగనుంది.  మే 17 సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన ఎన్నికల ప్రచారం బెంగాల్ లో జరుగుతున్న గొడవల కారణంగా ఒక్క రోజు ముందుగానే ముగుస్తుంది.