ములుగు ఆస్పత్రికి వైద్య పరికరాలు అందజేత

ములుగు ఆస్పత్రికి వైద్య పరికరాలు అందజేత
  • ఈసీఐఎల్ ప్రతినిధులను అభినందించిన కలెక్టర్​

ములుగు, వెలుగు: ఈసీఐఎల్ హైదరాబాద్ ప్రతినిధులు సీఎస్సార్​లో భాగంగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి రూ.20 లక్షల విలువైన సీ ఆర్మ్ మెషీన్, ఓట్ లైట్, ఫ్రాక్చర్ టేబుల్ ను కలెక్టర్ దివాకర టి.ఎస్. చేతులమీదుగా గురువారం అందజేశారు. వారిని కలెక్టర్​అభినందించారు.

 భవిష్యత్​లోనూ హాస్పిటల్​కు ఉపయోగపడే పనులు చేయడానికి ముందుకు రావాలని కోరారు. సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, ఈసీఐఎల్ ప్రతినిధులు మురళీధర్, సుధాన్షు కుమార్, రంజన్ శ్రీవాస్తవ, డాక్టర్ వేణు బాబు, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి కుమార్ తదితరులు పాల్గొన్నారు.