ఢిల్లీ లిక్కర్ స్కాం: హైదరాబాద్ లో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం:  హైదరాబాద్ లో ఈడీ సోదాలు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లింకులపై ఈడీ కూపీ లాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు అధికారుల టీమ్ ఉదయం నుంచి తనిఖీలు చేస్తోంది. రాష్ట్రంలోని ఓ మహిళా నేత ఆడిటర్ ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. దోమలగూడలోని ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇంట్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. గోరంట్ల అండ్ అసోసియేట్ ఉద్యోగి శ్రీధర్ ఇంట్లో ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇటు మాదాపూర్ లోని అనూస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

అలేఖ్య ప్రణవ్ హోమ్స్ లో కూడా ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ స్కాంలో హైదరాబాద్ లింకులపై ఇప్పటికే కేసు నమోదైంది. నిందితుల్లో నగరానికి చెందిన రామచంద్ర పిళ్లై ఉన్నారు.