
కామారెడ్డి టౌన్, వెలుగు: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విన్నవించారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, జీతాలుపెంచాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా ప్రెసిడెంట్సత్యనారాయణ, ప్రతినిధులు రాములు, సంతోష్రెడ్డి, రాజశేఖర్, సూర్యపాల్ ఉన్నారు.