- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: విద్యాసంస్థల భూములను రియల్ఎస్టేట్ మాఫియాకు అప్పగించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉర్దూ వర్సిటీకి ప్రభుత్వం1998లో 200 ఎకరాలు కేటాయించిందని, ఇందులో 50 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రంగారెడ్డి కలెక్టర్ నోటీసు జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ నోటీసును వెనక్కి తీసుకొని, తరగతి గదులు, హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
