వ్యర్థాలతో ఎదులాబాద్ చెరువు నాశనం.. కాపాడాలని గ్రామస్తుల ఆందోళన

వ్యర్థాలతో ఎదులాబాద్ చెరువు నాశనం.. కాపాడాలని గ్రామస్తుల ఆందోళన
  • వ్యర్థాలు కలువకుండా చూడాలని విన్నపం

మేడ్చల్ కలెక్టరేట్ వెలుగు: డంపింగ్​ వ్యర్థాలు కలవడంతో ఎదులాబాద్​ శ్రీలక్ష్మీనారాయణ చెరువు నాశనమవుతోందని ఎదులాబాద్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువును కాపాడాలని కోరుతూ సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. జవహర్​నగర్​లోని డంపింగ్​యార్డు నుంచి వ్యర్థాలు ఎరిమల్లేవాగు ద్వారా ఎదులాబాద్​ చెరువులో చేరుతున్నాయన్నారు. 

ఫ్యాక్టరీల రసాయనాలు కూడా ఇందులోనే కలుస్తున్నాయని ఆరోపించారు. దీంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. చెరువును కాపాడి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.