‘రాధేశ్యామ్’ నుంచి కొత్త సాంగ్ రిలీజ్

‘రాధేశ్యామ్’ నుంచి కొత్త సాంగ్ రిలీజ్

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. మార్చి 11న విడుదల కానున్న ఈ మూవీ నుంచి తాజాగా ‘ఈ రాతలే‘ అనే సాంగ్ విడుదలైంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి ఇవతూరి పాడారు. జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకు హిందీ వెర్షన్ ‘జాన్ హై మేరీ’ కూడా ట్రెండింగ్ లో ఉంది. ప్రేరణ (పూజా హెగ్డే)ను కలిసేందుకు విక్రమాదిత్య (ప్రభాస్) పడే తపనను చూపించే విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్, పాటలతో ‘రాధేశ్యామ్’పై హైప్ మరింత పెరుగుతోంది. ఇక రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీనియర్ నటి భాగ్యశ్రీ, సచిన్ ఖేద్కర్, కునాల్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించారు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం.. తెలుగు, తమిళం, కన్నడతోపాటు మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

మరిన్ని వార్తల కోసం..

పుతిన్ మెంటలోడు: రష్యా వార్‌పై కేఏ పాల్ ఫైర్

‘భీమ్లా నాయక్’పై ఆర్జీవీ, నారా లోకేశ్ ట్వీట్లు

ఉక్రెయిన్ రాజధానిని ఆక్రమించిన రష్యా