
- ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మంది అరెస్ట్
- పోక్సో కేసు నమోదు
గుడిహత్నూర్, వెలుగు : స్నేహం పేరుతో సోషల్ మీడియాలో బాలికను పరిచయం చేసుకొని, ఆమెతో చేసిన చాటింగ్ను అడ్డు పెట్టుకొని వేధించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ తెలిపిన వివరాల ప్రకారం... గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు కొన్ని రోజుల కింద మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరూ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుకోగా... సదరు బాలుడు దానిని స్క్రీన్ రికార్డ్ చేశాడు.
తర్వాత ఆ వీడియోను తన ఫ్రెండ్స్కు సెండ్ చేశాడు. ఈ వీడియోను అడ్డం పెట్టుకొని బాలికను వేధింపులకు గురి చేశారు. ఓ యువకుడు వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం తెలుసుకున్న బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన షీ టీం ఇద్దరు మైనర్లతో పాటు మరో ఆరుగురు యువకులను అదుపులోకి పోక్స్ కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ వివరించారు