కంగన నోరుజారితే ఏక్తా సారీ చెప్పింది

కంగన నోరుజారితే ఏక్తా సారీ చెప్పింది

బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్త కపూర్ జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ చిత్ర హీరోయిన్ కంగనా రనౌత్ ఓ సందర్భంలో జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా పాట విడుదల కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..  ఆ జర్నలిస్టు తన ‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చాడని మండి పడింది. దీంతో కంగన క్షమాపణలు చెప్పాలని ‘ఎంటర్టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్ట్స్ ఆఫ్ ఇండియా’ డిమాండ్ చేసింది. లేదంటే సినిమా ప్రమోషన్స్ విషయంలో సహకరించేది లేదని తేల్చి చెప్పారు.

వారి డిమాండ్ తో ఉలిక్కి పడ్డ ఏక్తాకపూర్.. జరిగిన ఘటనపై క్షమాపణలు కోరుతున్నట్టు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, జరిగిన ఘటనను మరిచిపోయి మూవీ ప్రమోషన్స్ కోసం సహకరించాల్సిందిగా జర్నలిస్టు సంఘాన్ని కోరారు.