రాజ్య సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

రాజ్య సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: జూన్ లో ఖాళీ కాబోతున్న మొత్తం 57 రాజ్య సభ స్థానాల ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మే 24న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనుండగా... మే 31న నామినేషన్లకు చివరి తేదీగా కమిషన్ నిర్ణయించింది. ఇక జూన్ 1న నామినేషన్ల పరిశీలన, జూన్ 10న పోలింగ్... అదే రోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు జరగనుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇక తెలంగాణ నుంచి కెప్టెన్ లక్షీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ నుంచి రిటైర్డ్ కాబోతున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

అయూబ్ కుటుంబ కష్టం విని భావోద్వేగానికి గురైన ప్రధాని

GHMC పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు పూటల భోజనం