కొత్త సీఈసీగా సుశీల్ చంద్ర

కొత్త సీఈసీగా సుశీల్ చంద్ర

నేటితో ముగియనున్న సునీల్ అరోరా పదవీకాలం

 కొత్తచీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) గా సుశీల్ చంద్రను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్లలో సీనియర్ మెంబర్ ను సీఈసీగా నియమించే సంప్రదాయం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆయన పేరును ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుశీల్ చంద్ర నియమాకంపై త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సునీల్ అరోరా పదవీ కాలం ఈ నెల 12తో ముగుస్తుంది. మరుసటి రోజే సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్  డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ గా పని చేసిన సుశీల్ చంద్ర.. 2019 ఫిబ్రవరి 14న ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయ్యారు. 2022 మే 14 వరకు ఆయన పదవీకాలం ఉంది.