ఓటర్లు ఇబ్బంది పడకుండా చూడాలి : ధ్రువ్

ఓటర్లు ఇబ్బంది పడకుండా చూడాలి : ధ్రువ్

మరికల్, వెలుగు: ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు ఇబ్బందులు పడకుండా సౌలతులు కల్పించాలని ఎన్నికల పరిశీలకులు, డీఐజీ ధ్రువ్​ పోలీసులకు సూచించారు. బుధవారం మండలంలోని మరికల్, చిత్తనూర్​ గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ రాజేందర్, ఎస్ఐ హరిప్రసాద్​రెడ్డి పాల్గొన్నారు. 

ఓటర్ల ఇంటికెళ్లి స్లిప్పులు ఇవ్వాలి

బాలానగర్: ఓటరు స్లిప్పులను ఇండ్లకు వెళ్లి అందజేయాలని తహసీల్దార్  శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం ఎంపీడీవో మీటింగ్ హాలులో సెక్టోరల్ ఆఫీసర్, సూపర్ వైజర్స్, బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు స్లిప్పులను ఓటర్లకు అందించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఎంపీడీవో కృష్ణారావు, ఏవో ప్రశాంత్ రెడ్డి, ఎంపీవో విజయకుమార్, ఇరిగేషన్​ ఏఈ అనిల్ సాగర్, ఆర్ఐలు వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, రాంమోహన్ రావు, సాయిలు పాల్గొన్నారు.