డిసెంబర్​ 15 లోపే బీజేపీ రాష్ట్ర చీఫ్​ ఎన్నిక

డిసెంబర్​ 15 లోపే బీజేపీ రాష్ట్ర చీఫ్​ ఎన్నిక
  •     అన్ని మున్సిపాలిటీల్లో పోటీ
  •     ఆఫీస్ బేరర్ల సమావేశంలో నడ్డా

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను డిసెంబర్​ 15లోగా పూర్తి చేయాలని ఆ పార్టీ జాతీయ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జేపీ నడ్డా ఆదేశించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక డిసెంబర్ 15 నుంచి 31 లోపు ఉంటుందని వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా బీజేపీ పోటీ చేస్తుందన్నారు.  క్లస్టర్ ఇన్ చార్జ్ లు, అసెంబ్లీ, లోక్ సభకు పోటీ చేసినవారు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. 50 మందికి సభ్యత్వం ఇప్పించిన వారికే క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని చెప్పారు. ఈ నెల 20 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. 31 జిల్లాల ఇన్ చార్జ్ ల నియామకానికి అభ్యర్థులను గుర్తించాలని రాష్ట్ర నాయకులను ఆదేశించారు. సెప్టెంబర్ 20కల్లా బూత్ కమిటీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని,  అక్టోబర్​లో మండల అధ్యక్షులను, నవంబర్​లో  జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేయాలన్నారు.నిజామాబాద్​ జిల్లా నేత భూపతిరెడ్డిని రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్​ అధికారిగా నియమించారు.