పుల్లూరు జాతర ఉత్సవ కమిటీ ఎన్నిక

పుల్లూరు జాతర ఉత్సవ కమిటీ ఎన్నిక

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయఉత్సవ కమిటీని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ చైర్మన్ గా పుల్లూర్ కనకయ్య గౌడ్ ను నియమించగా ఆయనతో పాటు ఆరుగురు డైరెక్టర్లుగా ఒగ్గు యాదగిరి, ఐరేని దేవిరెడ్డి, బెస్త రాములు, గొడుగు రవి, పెద్ద కర్రే కిష్టయ్య, వడాల కనకయ్య ను నియమించారు.

ఈ మేరకు సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ నుంచి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కనకయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జరిగే పుల్లూర్ దేవస్థాన జాతరకు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యాదగిరి, రాములు, అంజిరెడ్డి, రాజ్ బహదూర్ రెడ్డి, వహబ్, అజ్మత్, శ్రీనివాస్ రెడ్డి, రామస్వామి, రాజిరెడ్డి, శీను, శివప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.