రాహుల్ గాంధీ హెలికాప్టర్ తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

రాహుల్ గాంధీ హెలికాప్టర్ తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

దేశంలో ఎలక్షన్ హీట్ బాగా ఉంది. మరికొన్ని రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో.. ఎన్నికల అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ను తనిఖీ చేశారు ఎన్నికల అధికారులు. 

2024, ఏప్రిల్ 15వ తేదీ ఉదయం రాహుల్ గాంధీ.. తమిళనాడు రాష్టం నీలగిరి జిల్లా పాండలూరు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే కొంత మంది ఎన్నికల అధికారులు.. రాహుల్ గాంధీ వచ్చిన హెలికాఫ్టర్ ను తనిఖీ చేశారు. అందులో వారికి ఏమీ దొరకలేదు. దీంతో తనిఖీ పూర్తయిన తర్వాత ఉట్టి చేతులతోనే వెళ్లిపోయారు ఎన్నికల అధికారులు. ఎన్నికల సిబ్బంది తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుందని.. అదే విధంగా అన్ని పార్టీల నేతల విమానాలు, హెలికాఫ్టర్లను తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 

తమిళనాడు వచ్చిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్, డీఎంకే నేతలు, కార్యకర్తలు.