
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో 13 రాజ్యసభ స్థానాల భర్తీకి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 31న పోలింగ్ నిర్వహించనుంది. 13 స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఒకరు, సీపీఎం నుంచి ఇద్దరు, అకాలీదళ్ నుంచి ఇద్దరు, ఎల్జేడీ, ఎన్పీఎఫ్ నుంచి ఒక్కో సభ్యుడు ఉన్నారు. ఈ నెల నుంచి 14నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 21వరకు కొనసాగుతుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ, 31న ఓటింగ్, అదేరోజు కౌంటింగ్ జరుగుతుంది.