14 రాష్ట్రాల్లోని 49 అసెంబ్లీ సీట్లకు వచ్చే ఆర్నెళ్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలంతా తాజా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 11 మంది ఎమ్మెల్యేలు లోక్సభకు ఎన్నికైయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలతో మహారాష్ట్ర రెండో ప్లేస్లో, ఐదుగురు ఎమ్మెల్యేలతో బీహార్ మూడోస్థానంలో ఉంది. వీటితోపాటు మరో రెండు ఎమ్మెల్సీ, నాలుగు రాజ్యసభ సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హింజిలి, బీజేపూర్ రెండు అసెంబ్లీ సీట్లలోనూ గెలిచారు. అంచేత ఆయన ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంది. జార్ఖండ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎంపీలుగా గెలిచారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరో ఆర్నెళ్లలో ఎన్నికలు జరగనున్నందున… అసెంబ్లీ ఎలక్షన్లతోపాటే ఆ రెండు సీట్లకూ ఎన్నికలు జరిగే అవకాశముంది. యూపీలో బీజేపీ తరపున ఎనిమిది మంది, బీఎస్పీ, ఎస్పీ, అప్నాదళ్కు చెందిన ఒక్కో ఎమ్మెల్యే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో ముగ్గురు ఆదిత్యనాథ్ సర్కార్ కేబినెట్లో మంత్రులుగా కూడా ఉన్నారు. బీహార్లో ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా లోక్సభకు ఎన్నికయ్యారు. నితీశ్కుమార్ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులుగా పనిచేస్తున్నారు. ముగ్గురు జేడీయూ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. ఒడిశాకు చెందిన నలుగురు బిజూ జనతాదళ్ రాజ్యసభ ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో వాళ్లు రాజీనామా చేసిన సీట్లకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
యూపీలో 11 ఎమ్మెల్యే సీట్లకు.. త్వరలో ఎన్నికలు
- దేశం
- May 26, 2019
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు