
పరిస్థితిని దిగజార్చే నిర్ణయం తీసుకోవద్దు
ప్రధానిని మోడీని కలిసిన ఫరూక్ అబ్దుల్లా టీమ్
న్యూఢిల్లీ:జమ్మూకాశ్మీర్లో ఈ ఏడాది ముగిసేలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి నేషనల్కాన్ఫరెన్స్చీఫ్ ఫరూక్అబ్దుల్లా ఆధ్వర్యంలోని టీమ్విజ్ఞప్తి చేసింది. కాశ్మీర్వ్యాలీలో పరిస్థితిని మరింత దిగజార్చేందుకు దారితీసే ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని కోరింది. ఫరూక్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి ఆయనతో 20 నిమిషాల పాటు చర్చలు జరిపింది. తర్వాత జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, ప్రజల భయాందోళనల గురించి ప్రధానికి వివరించామని చెప్పారు.
గత ఏడాది కంటే ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీలో అతికష్టం మీద పరిస్థితి మెరుగుపడిందని, కానీ, ఏ సమయంలోనైనా అది క్షీణించవచ్చన్నారు. ఆర్టికల్35ఏను రద్దు చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నందున, దాని గురించి ప్రధానితో మాట్లాడారా? అని విలేకరులు ప్రశ్నించగా.. పరిస్థితిని దిగజార్చే ఏ స్టెప్కూడా తీసుకోరాదని తాము చెప్పామన్నారు. అంటే ఆర్టికల్35ఏ, ఆర్టికల్370, ఇతర అన్ని విషయాలకూ ఇది వర్తిస్తుందన్నారు. ప్రధాని ఏం చెప్పారన్నది వెల్లడించేందుకు నిరాకరించిన ఒమర్.. తమ మధ్య మీటింగ్సంతృప్తికరంగా జరిగిందంటూ సమాధానం దాటవేశారు.