హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం (ఐఈఈఎంఏ) ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ షో అయిన ఎలెక్ట్రామా 16వ ఎడిషన్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 26 వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
రీఇమేజినింగ్ ఎనర్జీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్” అనే థీమ్తో దీనిని ఏర్పాటు చేస్తారు. పర్యావరణానికి మరింత మేలు చేసేలా ఉత్పత్తి సాధించడంపై ఈ సందర్భంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరిశ్రమ నాయకులు, విధాన రూపకర్తలు, వాటాదారులు ఈ విషయాల గురించి మాట్లాడుతారు. ఈ కార్యక్రమానికి 100కుపైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. 20 బిలియన్ డాలర్ల విలువైన బిజినెస్ ఎంక్వైరీలు వస్తాయని అంచనా.