- చైనా పార్టులు వాడటమే కారణం
- ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కరెంటు బండ్లు తయారు చేసే ఆరు స్టార్టప్ కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు తెచ్చి వాడటంతో, తాము పొందిన సబ్సిడీ మొత్తం రూ. 500 కోట్లను తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.లోకలైజేషన్ రూల్స్ను పాటించడంలో ఈ కంపెనీలు విఫలమైనట్లు దర్యాప్తులో తేలింది. ఈ–స్కూటర్లు కొన్ని పేలిపోవడంతో కిందటేడాదిలో అసలు ఈ కంపెనీలు లోకలై జేషన్ రూల్స్ ఏ మేరకు పాటిస్తున్నాయనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.
ఈ దర్యాప్తులోనే కొన్ని కంపెనీలు చైనా నుంచి రెడీ టూ యూజ్ పార్టులను కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడైంది. ఫలితంగా క్వాలిటీ దెబ్బతింటున్నట్లు గుర్తించారు. లోకలైజేషన్ రూల్స్ కరెంటు బండ్ల తయారీ కంపెనీలను కొంత ఇబ్బందికి గురి చేస్తున్నట్లు ఎక్స్పర్టులుచెబుతున్నారు.