సిద్దిపేట రూరల్/ మెదక్టౌన్, వెలుగు: విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిద్దిపేట సర్కిల్ ఆఫీస్ ఎదుట విద్యుత్ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వీరభద్రయ్య, లీడర్లు గంగాధర్, హుస్సేన్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు తో పేదలు, రైతులపై తీరని భారం పడుతుందన్నారు. విద్యుత్ సంస్థలు కార్పొరేట్సంస్థల చేతుల్లోకి పోతే అందరూ నష్టపోతారన్నారు. వెంటనే బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మెదక్ సర్కిల్ ఆఫీసులో..
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం మెదక్ సర్కిల్ ఆఫీస్ ఎదుట విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ జానకిరాములు , ఏడీఈ మోహన్ బాబు, ఆయా యూనియన్ల నాయకులు ప్రసాద్, వేణు, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
