
న్యూఢిల్లీ: దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం కొత్త సంవత్సరంలో మరింత విస్తరించనుంది. ఈ సెక్టార్ ప్రొడక్షన్ 2024 లో 15 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగి 115 బిలియన్ డాలర్ల (రూ.9.54 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్ గ్లోబల్ కంపెనీలు లోకల్గా కాంపోనెంట్లను, ప్రొడక్ట్లను తయారు చేయడంపై ఫోకస్ పెట్టాయని వెల్లడించాయి. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్లో కీలంగా ఉన్న మొబైల్ ఫోన్స్ తయారీ సెగ్మెంట్ 2024 లో దూసుకుపోతుందని అంచనా.
మార్చి 31 నాటికి ఫోన్ల తయారీ 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నారు. 2023 లోని మార్చి 31 నాటికి ఈ విలువ 42 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. గూగుల్ పిక్సల్ స్మార్ట్ఫోన్ల తయారీ 2024 లోని మొదటి క్వార్టర్లో ప్రారంభం కానుంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ 115 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మోహింద్రూ అన్నారు. 2013–14 లో రూ.1,80,454 కోట్లు (29.8 బిలియన్ డాలర్లు) ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ 2022–23 నాటికి రూ.8.22 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు.