
ఎల్కతుర్తి, వెలుగు : బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ఎల్కతుర్తిలో పంట కాల్వలను మొరంతో పూడ్చడంతో వాన నీళ్లు పంట పొలాల్లో నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీళ్లు వెళ్లే దారి లేక రోడ్డు వెంట పొలాలన్నీ మునిగి పోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ లీడర్లు కాల్వల్లో మొరం తీయించగా, మరికొన్ని చోట్ల రైతులే తొలగించుకున్నారు.
అక్కడక్కడ క్లీన్ చేయకపోవడంతో పంటలు మునిగాయి. అధికారులు కాల్వలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.