పోరాడండి.. లేదంటే చనిపోతారు..టెస్లా సీఈవో ఎలాన్ మస్క్

పోరాడండి.. లేదంటే చనిపోతారు..టెస్లా సీఈవో ఎలాన్ మస్క్

బ్రిటన్: వలసల కారణంగా బ్రిటన్‌‌‌‌ నాశనం అవుతున్నదని టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్‌‌‌‌ ఎలాన్‌‌‌‌ మస్క్‌‌‌‌ అన్నారు. మైగ్రేషన్​తో హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇ‍ప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు. బ్రిటన్‌‌‌‌ ప్రభుత్వంలో మార్పు రావాలని అనుకుంటున్నాను’’ అని మస్క్ అన్నారు.

 బ్రిటన్‌‌‌‌లో ఆదివారం  నిర్వహించిన ‘యాంటీ ఇమిగ్రేషన్‌‌‌‌’ ర్యాలీని ఉద్దేశించి మస్క్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘బ్రిటన్‌‌‌‌ ప్రభుత్వంలో భారీ సంస్కరణలు రావాలి. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసుకోవాలి’’ అని ఎలాన్​ మస్క్​ పిలుపునిచ్చారు.