Twitter Layoffs : ఉద్యోగుల్ని తొలగించిన మస్క్

Twitter Layoffs : ఉద్యోగుల్ని తొలగించిన మస్క్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే 4వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన సంస్థ తాజాగా అడ్వర్టైజింగ్ సేల్స్ టీంలో మరికొంత మందిని ఇంటికి సాగనంపింది. ఎంత మందిని ఉద్యోగాల నుంచి తొలగించారన్న విషయం కచ్చితంగా తెలియకపోయినా ఆ సంఖ్య 800 వరకు ఉంటుందని సమాచారం. వీరంతా సేల్స్, మార్కెటింగ్ విభాగానికి చెందిన ఎంప్లాయిస్ అని తెలుస్తోంది. 

ఈ మధ్యనే ఢిల్లీ, ముంబై ఆఫీసుల్ని మూసేసిన ఎలాన్ మస్క్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. కాస్ట్ కట్టింగ్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో కేవలం బెంగళూరులో మాత్రమే ట్విట్టర్ ఆఫీస్ నడుస్తోంది. గతేడాది చివరలో భారత్ లో పనిచేస్తున్న  200 మంది స్టాఫ్ లో 90శాతం మందికి మస్క్ పిక్ స్లిప్పులిచ్చారు.