న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగుల యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీకి హెచ్సీఎల్టెక్నాలజీస్పై ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీ తాజాగా ప్రకటించిన ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) పే స్ట్రక్చర్పై తమ అభ్యంతరాలతో ఈ కంప్లెయింట్ను ఫైల్ చేశారు. కొవిడ్కు ముందు తరహాలో ఈపీబీ అమలు చేయాలని హెచ్సీఎల్ టెక్ ఇటీవల నిర్ణయించింది. బెంచ్లో ఉండే ఉద్యోగులకు ఈపీపీ చెల్లించరు.
తగ్గిన నెలవారీ జీతాలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఈ కొత్త విధానం నచ్చలేదు. ఏప్రిల్ 1 నుంచి హెచ్సీఎల్ టెక్ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. కొత్త పాలసీ తెస్తున్న విషయాన్ని ఉద్యోగులకు ఒక్క రోజు ముందు మాత్రమే ఈమెయిల్ ద్వారా తెలియచేసింది. మరోవైపు, ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) ఈ 3 బ్యాండ్ దాకా ఉన్న ఉద్యోగులకు చెల్లిస్తూనే ఉన్నామని హెచ్సీఎల్ టెక్ పేర్కొంది.
నెలవారీగా ఫిక్స్డ్ రేటు కింద ఈపీబీని గతంలో ఇచ్చేవారని, బెంచ్లో ఉన్న ఉద్యోగులకు కూడా చెల్లించే వారని నైట్స్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజ చెప్పారు. ఈ పాలసీని కంపెనీ హఠాత్తుగా మార్చి వేసిందని విమర్శించారు. దీంతో లేబర్ మినిస్ట్రీ వద్ద నైట్స్ ఫిర్యాదు చేసిందని చెప్పారు.