1962 సిబ్బందికి ఆర్నెల్లుగా జీతాల్లేవ్

1962 సిబ్బందికి ఆర్నెల్లుగా జీతాల్లేవ్

మంచిర్యాల, వెలుగు: సంచార పశువైద్యశాలల (1962) ఉద్యోగులకు ఆర్నెల్లుగా జీతాలు రావడంలేదు. అరకొర జీతాలు కూడా నెలనెలా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని సిబ్బంది వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో   ప్రభుత్వం సంచార పశువైద్యశాలలను ఏర్పాటు చేసింది. ఒక్కో వెహికల్​లో వెటర్నరీ డాక్టర్, డ్రైవర్, ప్యారావిట్, అటెండర్ లను  కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించింది. రాష్ట్రంలో 400 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు.  1962 అంబులెన్స్​ల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన సర్కారు.. సిబ్బంది జీతాలను ఆ సంస్థ ద్వారానే చెల్లిస్తోంది. డాక్టర్​కు రూ.40వేలు, ప్యారావిట్​కు రూ.15వేలు, డ్రైవర్​కు రూ.8వేలు, హెల్పర్​కు  రూ.7వేలు ఇస్తోంది.  ప్రభుత్వం సక్రమంగా బడ్జెట్ రిలీజ్ చేయకపోవడంతో ఆర్నెల్లుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సంధ్య, ప్యారావిట్లు ప్రభాకర్, రత్నాకర్, డ్రైవర్ మల్లేశ్​, హెల్పర్ ఎండీ.పారూఖ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.