ఆర్టీసీ అధికారులు వేధిస్తున్నారని నిరసన

ఆర్టీసీ అధికారులు వేధిస్తున్నారని నిరసన

మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు ఆందోళనకు దిగారు కార్మికులు. అధికారులు అకారణంగా వేధిస్తున్నారని నిరసన తెలిపారు. దీంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్మికులను ఇబ్బంది పెట్టడంపై డీఎంను ప్రశ్నించారు కార్మిక నేతలు. సమస్యలపై అడిగినందుకే డ్యూటీకి తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.