
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్ముందు ఈఎన్సీ అనిల్ హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ గ్రౌటింగ్కు సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు కమిషన్..ఆయన్ను పిలిచినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈఎన్సీ అనిల్ కమిషన్ ఆఫీసుకు వెళ్లి వివరాలను సమర్పించినట్టు సమాచారం. విచారణలను పూర్తి చేసిన కమిషన్ ఇప్పటికే రిపోర్టుపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బ్యారేజీకి చేసిన గ్రౌటింగ్ పై అదనపు సమాచారాన్ని కమిషన్ కోరినట్టు తెలిసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత.. ఏడో బ్లాక్కింద భారీ గొయ్యిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా ఈఎన్సీ అనిల్ అక్కడ గ్రౌటింగ్ చేయించి గొయ్యిని పూడ్చారు. ఈ క్రమంలోనే గ్రౌటింగ్ చేయడాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పుబట్టింది.