బంగ్లా చిత్తు.. 137 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ విజయం

బంగ్లా చిత్తు.. 137 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌  విజయం

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో   ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది.  137 పరుగుల భారీ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్ మలన్ (140) , జో రూట్ (82) ,  బెయిర్‌స్టో (52) పరుగులు చేశారు. 

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌  227 పరుగులకే ఆటను ముగించింది.  ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (76), ముష్ఫికర్‌ రహీమ్‌ (51) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రీస్‌ టాప్లే 4 వికెట్లు పడగొట్టగా.. వోక్స్‌ 2 వికెట్లు తీశాడు. సామ్‌కరన్‌, మార్క్‌వుడ్‌, అదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు. కాగా ఈ మెగా టోర్నీలో  ఇంగ్లండ్ కు ఇది తొలి విక్టరీ కాగా, బంగ్లాదేశ్‌కు రెండో ఓటమి.