
నారాయణ, చైతన్య విద్యాసంస్థలపై ఇంజనీరింగ్ విద్యార్థి జేఏసీ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు:ఫైర్ సేఫ్టీ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న నారాయణ, చైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్( డీఐఈవో)కు ఫిర్యాదు చేశారు. శ్రీ చైతన్య కాలేజ్ వేద వ్యాస క్యాంపస్ , నారాయణ జూనియర్ కాలేజ్ బాసర శరణి క్యాంపస్లో వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారని జేఏసీ ప్రెసిడెంట్ శరణ్కుమార్, కార్తీక్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ జోన్లో 30 వరకు బ్రాంచ్లు ఉన్నాయని, ఇందులో వేలాది మంది స్టూడెంట్లు చదువుతున్నారని తెలిపారు. ఇరుకు గదుల్లో క్లాస్లు, హాస్టళ్లు నడుపుతున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే స్టూడెంట్లు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఆయా క్యాంపస్లకు నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని నేతలు డీఐఈవోను కోరారు.