
పాలకుర్తి, వెలుగు: ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ కమ్మగాని శ్రీనివాస్ది ప్రభుత్వ హత్యేనని మూడు నెలలుగా జీతాలు రాక ఉద్యోగులు మానసిక వేదన పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన దేవరుప్పుల ఈజీఎస్ ఎపీఓఇటీవల హార్ట్ ఎటాక్తో మృతి చెందగా గురువారం ఆయన కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం చిరుద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్ కుటుంబానికి రూ. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.