హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఈటల కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హుటాహుటిన విచారణ జరపడం.. కబ్జా చేసినట్లు రిపోర్టు ఇవ్వడంతో వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అడిగితే రాజీనామా చేసి ఉండే వాడిని.. నాపై కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని రగిలిపోయిన ఈటల భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు, అభిమానులతో మంతనాలు చేస్తున్నారు. తనకు సంఘీభావం తెలిపిన ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పుడు మరో ఉద్యమం మొదలైంది.. ఆత్మగౌరవం కోసం పోరడతానని.. తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పుడువేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూములొక్కటే కాదు తన వ్యాపారాలన్నింటిపైనా సిట్టింగ్ జడ్జితో విచారణకైనా సిద్ధమేనని ప్రకటించినా పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరో వైపు ఆయన కుటుంబ సభ్యుల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా తమ బూముల్లో సర్వే చేశారని.. కలెక్టర్ నివేదిక మొత్తం తప్పుల తడకగా ఉందని కోర్టులో ఫిర్యాదు చేశారు. తమ కంపెనీల్లోకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రవేశించి విచారణ పేరుతో సిబ్బందిని బెదిరించారని..తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని కోర్టును కోరారు. బలవంతపు చర్యలు తీసుకోరాదని డీజీపీ, విజిలెన్స్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఈటల కుటుంబ కంపెనీ కోర్టును కోరింది.
హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం
- తెలంగాణం
- May 4, 2021
లేటెస్ట్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
Most Read News
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం