- డిప్యూటీ సీఎం భట్టికి ఈయూ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, వెంకన్నలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఆదివారం భట్టిని కలిసి నేతలు వినతి పత్రం అందించారు. కార్మికుల పీఆర్సీలు, డీఏ బకాయిలు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అంతకు ముందు ఇవే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కూడా కలిశారు. గత 9 ఏళ్లు ఆర్టీసీని ఆగం చేశారని, కార్మికులు ఎంతో గోస పడ్డారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.