స్విచ్ బైక్ షోరూమ్ షురూ
హైదరాబాద్, వెలుగు : ఎలక్ర్టికల్ ఫోల్డబుల్ సైకిళ్ల తయారీ సంస్థ స్విచ్ బైక్ ఆదివారం హైదరాబాద్లో రెండవ షోరూమ్ను ప్రారంభించింది. గుజరాత్కు చెందిన ఈవీ బ్రాండ్ స్విచ్ బైక్ ఎస్జీ ఆటోమోటివ్స్తో కలిసి తన రెండవ స్టోర్ను మాదాపూర్లో ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా స్విచ్ బైక్ ఎండీ రాజ్కుమార్ పటేల్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఈవీ హబ్గా అవతరిస్తొందని, ప్రతి ఇంటికి స్విచ్ బైక్ను డెలివరీ చేయడానికి షోరూమ్లను ప్రారంభిస్తున్నామన్నారు. మొదటి షోరూం బేగంపేట్లో ఉండగా, ప్రస్తుతం మాదాపూర్లో ఓపెన్ చేశామన్నారు.
త్వరలోనే బెంగుళూరు సిటీలో ప్రారంభిస్తామన్నారు. ఈ షోరూంలో టెస్ట్డ్రైవ్ సదుపాయం ఉందని తెలిపారు. ఈ ఐదు మోడల్స్ను సైకిల్గానూ వాడొచ్చని పేర్కొన్నారు. ధరలు రూ. 40వేల నుండి 1.25 లక్షల వరకు ఉంటాయి. వీటిని ఫుల్ చార్జ్ చేయడానికి రెండున్నర గంటల టైం పడుతుంది. ఫుల్ చార్జ్ చేస్తే 60 నుండి 120 కిలోమీటర్ల వరకు గంటలకు వెళ్లవచ్చు. గరిష్ట వేగం 25 కిలోమీటర్లు. కార్యక్రమంలో ఎస్జీ ఆటోమోటివ్స్ ఎండీ గణపతి సర్వీ, కిషన్ గోపాల్, స్విచ్బైక్ సీఈఓ చింతన్ ఖత్రీ తదితరులు పాల్గొన్నారు.