పెన్షన్​ ఇవ్వాలంటూ వికలాంగుడి ధర్నా

పెన్షన్​ ఇవ్వాలంటూ వికలాంగుడి ధర్నా

చేర్యాల, వెలుగు: తాను బతికే ఉన్నానని, పెన్షన్​ఇవ్వాలంటూ ఓ వికలాంగుడు ఎంపీడీఓ ఆఫీసు ముందు ఆందోళనకు దిగాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన వికలాంగుడు అంజయ్య చనిపోయాడంటూ రికార్డుల నుంచి పేరు తొలగించి పెన్షన్​ఆపేశారు. దీంతో ఆఫీసర్ల తీరును నిరసిస్తూ ఎంపీడీఓ ఆఫీస్ ​ముందు శుక్రవారం తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు బొట్ల సుమతి, జిల్లా కన్వీనర్ సుతారి రమేశ్ ​తదితరులతో కలిసి ధర్నా చేశారు. నాలుగేండ్లుగా తనకు పెన్షన్​ఇవ్వడం లేదని వాపోయారు.  అంజయ్యకు వెంటనే పెన్షన్​ మంజూరు చేయకుంటే ఆందోళను చేపడతామని సుమతి, రమేశ్​ హెచ్చరించారు.