రిటెయిల్ ​రాకున్నా... అదానీ ఎఫ్‌పీఓ సక్సెస్

రిటెయిల్ ​రాకున్నా... అదానీ ఎఫ్‌పీఓ సక్సెస్
  • అదానీకి ఊరట...
  • ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లతో గట్టెక్కిన రూ. 20 వేల కోట్ల ఎఫ్​పీఓ

ముంబై: హిండెన్​బర్గ్​ రిపోర్టుతో రిటెయిల్​ ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నప్పటికీ అదానీ ఎంటర్​ప్రైజస్​ ఫాలో ఆన్​పబ్లిక్​ ఆఫరింగ్​​ (ఎఫ్​పీఓ) సక్సెసయింది. దేశంలోనే అతి పెద్ద ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫర్​ తెచ్చిన అదానీ ఎంటర్​ప్రైజస్​   రూ. 20 వేల కోట్లను సమీకరించగలిగింది. మంగళవారమే ఎఫ్​పీఓకి చివరి రోజు. ఎఫ్​పీఓ కింద 4,55,06,791 తాజా షేర్లను జారీ చేయనుండగా, మొత్తం 5,08,68,352 షేర్లకు బిడ్లు వచ్చినట్లు డేటా చెబుతోంది. అంటే 112 శాతం సబ్​స్క్రిప్షన్​ను అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ తెచ్చుకోగలిగింది. నాన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు (ఎన్​ఐఐ), క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ బయ్యర్లు (క్యూఐబీ) నుంచి ఈ ఎఫ్​పీఓకి స్ట్రాంగ్​ డిమాండ్​ వచ్చింది. ఎన్​ఐఐల కోసం 96.16 లక్షల షేర్లను కేటాయిస్తే, ఏకంగా దీనికి  మూడు రెట్లకు బిడ్స్​ దాఖలయ్యాయి. ఇక క్యూఐబీల కోసం 1.28 కోట్ల షేర్లను రిజర్వ్​ చేయగా, అంత మొత్తానికీ సబ్​స్క్రిప్షన్​ దొరికింది. ఎంప్లాయీ కోటా కింద 55 శాతం బిడ్లు వస్తే, రిటెయిల్​ ఇన్వెస్టర్ల నుంచి మాత్రం కేవలం 12 శాతం బిడ్లే వచ్చాయి. అదనపు డిస్కౌంట్లు ఇచ్చినా కూడా రిటెయిల్​ ఇన్వెస్టర్లు అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్ ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫరింగ్​​ పట్ల ఉత్సాహం చూపించలేదు. దీంతో రిటెయిల్​ షేర్​హోల్డర్లను భారీగా పెంచుకోవాలనే అదానీ ప్లాన్స్​ నెరవేరలేదు. 

ఈ ఎఫ్​పీఓ ఇంపార్టెంట్​...

పరువు ప్రతిష్టల విషయంలో ఛాలెంజ్​ ఎదుర్కొంటున్న అదానీకి ఈ ఫాలో ఆన్​పబ్లిక్​ ఆఫర్​ కీలకంగా మారింది. గ్రూప్ అప్పు తగ్గించుకోవడమే కాకుండా, ఇన్వెస్టర్ల నమ్మకం సడలలేదని చెప్పుకోవడానికీ అదానీ కి ఈ ఎఫ్​పీఓ వీలు కల్పిస్తుంది. ఇప్పటికే స్టాక్​ ఎక్స్చేంజీలలో  లిస్టింగ్ పొందిన కంపెనీలు ఇన్వెస్టర్లకు మరోసారి షేర్లను జారీ చేయడాన్నే ఫాలో ఆన్​ పబ్లిక్​ ఆఫరింగ్​ అంటారు. ​హిండెన్​బర్గ్​ రిపోర్టు నేపథ్యంలో అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​  ఫాలో ఆన్ పబ్లిక్​ ఆఫరింగ్​ సక్సెస్​పై చాలా మందికి అనుమానం కలిగింది. అబుధాబి ఇంటర్నేషనల్​ హోల్డింగ్​ కంపెనీ (ఐహెచ్​సీ) ఎఫ్​పీఓలో భాగంగా 400 మిలియన్​ డాలర్లను అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​లో పెట్టుబడిగా పెట్టింది. ఎమిరేట్​ రాయల్​ ఫ్యామిలీ ఈ ​ఐహెచ్​సీని కంట్రోల్​ చేస్తోంది. 
తాజా ఆఫరింగ్​లో 16 శాతాన్ని సమకూర్చిన ఐహెచ్​సీ ఇప్పటికే అదానీ కంపెనీలలో 2 బిలియన్​ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ ఎఫ్​పీఓ సక్సెస్​ కావడం ఇన్వెస్టర్లకు ఊరట కలిగిస్తుందని లుక్రార్​ ఎనలిటిక్స్​ (సింగపూర్​) సీనియర్​ క్రెడిట్​ ఎనలిస్ట్​ లియొనార్డ్​ లా చెప్పారు. ఎఫ్​పీఓ వల్ల కంపెనీలో ఇతరులు (ప్రమోటర్లు కాని వారు) వాటా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్​పై నమ్మకం సడలలేదనడానికి ఎఫ్​పీఓ సక్సెస్​ నిదర్శనంగా నిలుస్తుందని వెంచురా సెక్యూరిటీస్​ రిసెర్చ్​ హెడ్​ వినితి బొలిన్జ్​కర్​ చెప్పారు. కంపెనీ షేర్లలో ఒడిదుడుకులు తగ్గితే మళ్లీ చిన్న ఇన్వెస్టర్లు ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్న టైములో ఎఫ్​పీఓ తేవడం సరయిన నిర్ణయమేనని వివరించారు.

రిచ్​లిస్టులో కిందికి గౌతమ్​ అదానీ...

మంగళవారం ట్రేడింగ్​లో అదానీ ట్రాన్స్​మిషన్​, అదానీ గ్రీన్​ ఎనర్జీ, అదానీ పోర్ట్స్​ షేర్లు పెరిగినప్పటికీ, అదానీ టోటల్​ గ్యాస్​ షేరు మాత్రం పడిపోయింది. ఈ షేరు 10 శాతం పడటంతో లోయర్​ సర్క్యూట్​ను తాకింది. కిందటి వారం దాకా ప్రపంచంలోనే మూడో రిచెస్ట్​ వ్యక్తిగా నిలిచిన గౌతమ్​ అదానీ ఫోర్బ్స్​ రియల్ టైమ్​ గ్లోబల్​ రిచ్​ లిస్టులో ఇప్పుడు 8 వ ప్లేస్​కి పడిపో యారు.

ఇజ్రాయెల్​లో ఏఐ ల్యాబ్​..

హైఫా (ఇజ్రాయెల్​): ఇటీవల హైఫా పోర్టును చేజిక్కించుకున్న అదానీ గ్రూప్​ తాజాగా టెల్​ అవివ్​లో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) ల్యాబ్​ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హైఫాలో రియల్​ ఎస్టేట్​ను కూడా డెవలప్​ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఒక వైపు యూఎస్​ షార్ట్​సెల్లర్​ హిండెన్​ బర్గ్​ రిపోర్టుతో విమర్శలు ఎదుర్కొంటున్న గౌతమ్​ అదానీ హైఫా పోర్టు ఎగ్రిమెంట్​ సమయంలో ఇజ్రాయెల్​ ప్రధాన మంత్రి బెంజమిన్​ నెతన్యాహుతో కలిసి కనిపించడమే కాకుండా, ఇజ్రాయెల్​లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. హిండెన్​బర్గ్​ రిపోర్టుకు సంబంధించి మాత్రం ఇక్కడ గౌతమ్​ అదానీ ఎలాంటి ప్రస్తావనా తేలేదు. ఇండియా, యూఎస్​లలోని తమ ఏఐ ల్యాబ్​లతో కలిసి పనిచేసేలా టెల్ అవివ్​లో ఏఐ ల్యాబ్​ ఏర్పాటు చేయనున్నట్లు అదానీ పేర్కొన్నారు. హైఫా రూపురేఖలే మారిపోతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ సిటీని మార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.