
హైదరాబాద్,వెలుగు: సర్కారు, ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలకు అం దించే మిడ్డే మీల్స్ మెనూ మారింది. ఇక నుంచి డెయిలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు.
గురువారం కొత్త మెనూను డీఈవోలకు ఆమె పంపిం చారు. 12 నుంచి అన్ని స్కూళ్లలో ఈ మెనూను అమలు చేయాలని ఆదే శించారు. ప్రతి సోమవారం కిచిడీ పెట్టాలని, గురువారం వెజిటేబుల్ బిర్యానీ పెట్టాలన్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో పిల్లలకు గుడ్డు ఇవ్వాల ని ఆదేశించారు. మంగళవారం, శుక్రవారం సాంబార్ అదనంగా అందించాలన్నారు.