![కేసీఆర్ పదేళ్ల పాలనలో అందరి ఫోన్లు ట్యాప్ : మంత్రి శ్రీధర్ బాబు](https://static.v6velugu.com/uploads/2024/04/everyone-phones-were-tapped-during-kcrs-ten-year-rule-says-minister-sridhar-babu_AwElv0u2yk.jpg)
ఫోన్ట్యాపింగ్తో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతామని శ్రీధర్ బాబు స్పష్టం చే శారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఏ విధంగా ట్యాప్ చేశారో అందరికీ తెలుస్తూనే ఉన్నదన్నారు. జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటారన్నారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఇంట్లో మీడియాతో శ్రీధర్ బాబు మాట్లాడారు.
‘‘పదేండ్ల కాలంలో అందరి ఫోన్లనూ బీఆర్ఎస్పాలకులు ట్యాప్ చేశారు. ఈ విషయాన్ని వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇందులో ఎవరెవరున్నారో అన్నీ కాలక్రమంలో తెలుస్తాయి. ప్రస్తుతం దీనిపై విచారణ నడుస్తున్నది. చట్ట ప్రకారం చర్యలుంటాయి” అని తెలిపారు.
ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారన్న బీఆర్ఎస్నేతల కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘బీఆర్ఎస్నేతలు బీజేపీకి బీటీమ్గా ఉన్నారు. మరి ఇన్నాళ్లూ కేంద్రానికి వాళ్లు డబ్బులు పంపినట్టేనా?” అని కౌంటర్ ఇచ్చారు. తాము డబ్బులతో ఏనాడూ రాజకీయాలు చేయలేదన్నారు.