హైదరాబాద్, వెలుగు : పోలవరం బ్యాక్వాటర్తో తలెత్తే ముంపుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో అన్నీ తప్పులే ఉన్నాయని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముంపును తేల్చడానికి జాయింట్సర్వే చేయాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాలను పీపీఏ పట్టించుకోకుండా ఈ అఫిడవిట్ఫైల్చేసిందని మండిపడింది. సీడబ్ల్యూసీ, పీపీఏలకు మంగళవారం లెటర్ రాసింది.
పోలవరంతో తలెత్తే ముంపుపై 2022 అక్టోబర్7న, ఈ ఏడాది జనవరి 25న, ఏప్రిల్3న, 12న సమన్వయ కమిటీ సమావేశాల తర్వాత తీసుకున్న నిర్ణయాలేవి అమలు కాలేదని తెలంగాణ అధికారులు తెలిపారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఏపీ ఇచ్చిన డేటా ప్రకారమే.. తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని వెల్లడించారు. ఈ డేటా ప్రకారం పీపీఏ వెంటనే ఫీల్డ్సర్వే చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్లోపాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.