హైదరాబాద్, వెలుగు: రెన్యువబుల్ ఎనర్జీ ప్లాట్ఫారమ్ ఎవ్రెన్, ఎన్టీపీసీతో 750 మెగావాట్ల కరెంటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లోని సోలార్, విండ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి ఇది సరఫరా అవుతుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్లాట్ఫారమ్లలో ఎవ్రెన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి మొత్తం 11 గిగావాట్ల పైప్లైన్ పోర్ట్ఫోలియో ఉంది. దీనిలో 3.5 గిగావాట్లకు పైగా ప్రాజెక్టులు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఏటా సుమారు 2.5 బిలియన్ యూనిట్ల స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ ఉత్పత్తి జరుగుతుందని ఎవ్రెన్ తెలిపింది.
